Posts

దద్దమ్మ తేజస్వి కి బుద్ధి లేదు.. -- మాజీ ఎంపీ మధు యాష్కీ

Image
60 ఏళ్ల తెలంగాణ పోరాటం గురించి తెలుసుకో.. తేజస్వి సూర్య..! తెలంగాణ గురించి, తెలంగాణ పోరాటం గురించి అవగాహన లేని దద్దమ్మ మాటలు మాట్లాడుతున్నావ్.. ఒకప్పుడు మీ కర్ణాటక ప్రాంతంని ప్రాంతాలు కూడా హైదరాబాద్ రాష్ట్రంలో భాగమే..! నిజాం పాలనలో ఉన్నవే.. తెలంగాణ చరిత్ర నీకు తెలవదు, మీ నరేంద్ర మోడీకి తెలవదు..! మీ తాత ముత్తాతల చరిత్ర ఏందో.. తెలుసుకొని మాట్లాడు తేజస్వి సూర్య..! బ్రిటిష్ కాలంలో ఇండియా - పాకిస్తాన్ విభజన ఎప్పుడు జరిగింది.? ఏపీ, తెలంగాణ విభజన ఎందుకు జరిగిందో..? అవగాహన లేకుండా రెండింటిని పోల్చుతూ మాట్లాడడం నీ తెలివి తక్కువ తనానికి నిదర్శనం. ఇలాంటి సిగ్గుమాలిన మాటలు మాట్లాడితే తెలంగాణలోనే కాదు.. నీ కర్ణాటకలోనూ నిన్ను చెప్పులతో కొడతారు..! అవకాశం వచ్చినప్పుడల్లా బిజెపి నేతలు తెలంగాణ పట్ల అక్కస్సును వెళ్లగాక్కుతున్నారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పటికీ.. ఏ చిన్న సంఘటన కూడా జరగకుండా కలిసిమెలిసి జీవనం సాగిస్తున్న తీరు బిజెపి పాలకులకు కంటగింపుగా కనపడుతుందా...? తెలంగాణ రాష్ట్ర ఎదుగుదల ఓర్వలేక పోతున్నారా..? బిజెపి ఎంపీ అలా అడ్డగోలుగా మాట్లాడుతున్నా తెలంగాణ రాష్ట్రం నుం...

తెలంగాణ ప్రజలపై విషం చిమ్మిన భాజపా ఎంపీ తేజస్వి సూర్య

Image
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జీర్ణించుకోలేని భాజపా బెంగుళూరు ఎంపీ తేజస్వి సూర్య విషం చిమ్మడం తెలంగాణ ఆస్తిత్వంపై దాడిగా నిజామాబాద్ భారాస లీగల్ సెల్ కన్వీనర్ దాదన్నగారి మధుసుధన్ రావు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాస్ట్రాన్ని విభజించడాన్ని దేశ విభజనతో పోల్చడం అతని అజ్ఞానానికి పరాకాష్టగా అభివర్ణించారు. కేసీఆర్ మలిదశ ఉద్యమంతో సకల జనులు కలిసి వచ్చిన చారిత్రాత్మక పోరాటాన్ని కించపరచడమేనని తెలిపారు. తెలంగాణ ప్రజలను అవమానించిన భాజపా ఎంపీ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.ఆంధ్ర ఆధిపత్య శక్తుల తొత్తుగా మారిన తేజస్వి సూర్యను తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆయన పేర్కొన్నారు.తెలంగాణ ఆత్మగౌరవంపై, తెలంగాణ ఆస్తిత్వంపై భాజపా ఎంపీ విషపు గుళికలు విసిరి వేయడం సూర్యలో ఉన్న కపటత్వానికి నిదర్శనమని మధుసుధన్ రావు అన్నారు. సూర్య తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పి, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇 Click here to 👆 Follow Our WhatsApp Channel

జర్నలిస్టు కూతురు అనన్య స్టేట్ ర్యాంకర్.. CECలో 982 మార్కులతో మూడో స్థానం

Image
కామారెడ్డి కి చెందిన మున్నం అనన్య పట్టణంలోని VRK కళాశాలలో ఇంటర్ చదువుతోంది. ఆదివారం ఇంటర్ బోర్డ్ ప్రకటించిన ఫలితాల్లో CEC Group నుంచి 1000 Marks కు గాను 982 మార్క్స్ సాధించింది రాష్ట్రంలో మూడవ ర్యాంక్ సాధించింది. రాష్ట్ర టాపర్ కు 985 మార్క్స్ వచ్చాయి. ఇంటర్ ప్రథమ సంవత్సరంలోను స్టేట్ లో రెండవ ర్యాంక్ సాధించింది. IAS లక్ష్యంగా తాను CEC Group ను ఎంచుకొని శ్రమిస్తున్నట్లు ఈ సందర్బంగా అనన్య తెలిపింది. అనన్య తండ్రి మున్నం శ్రవణ్ కుమార్ 25 ఏళ్లుగా సీనియర్ జర్నలిస్ట్ గా పని చేస్తున్నారు. తల్లి మున్నం రాధ గృహిణి .తమ బిడ్డ ఇంటర్ లో అనుకున్న స్థాయిలో మార్క్ లు ర్యాంక్ ను సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. తమ కూతురు IAS లక్ష్యంగా కష్టపడి చదువుతొందని ,తన లక్ష్యం చేరుకొనేలా వెన్నంటి తోడ్పాటు నిస్తామని ఈ సందర్బంగా చెప్పారు.తమ పెద్ద కూతురు నిహారిక సైతం SRK విద్యసంస్తల్లొ చదివి ఇంటర్ MPC లో 950 పైగా మార్క్ లు సాధించి EAPCET లో మంచి ర్యాంక్ సాధించి నల్లమల్లారెడ్డి కాలెజిలొ ఫ్రీ సీట్ సాధించి CSE AI Group లొ B.Tech సెకండ్ ఈయర్ చదువుతోంది. తమ ఇద్దరు కూతుల్లు అనుకున్న లక్ష్యాల వైపు సాగుతుండడం పట్ల త...

నిజామాబాద్‌లో అన్నా బాహు సాఠే విగ్రహావిష్కరణ.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు ఘన స్వాగతం

Image
నిజామాబాద్ నగర పర్యటనకు ఆదివారం సాయంత్రం విచ్చేసిన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ఘన స్వాగతం పలికారు. చంద్రశేఖర్ కాలనీలో నూతనంగా నెలకొల్పిన అన్నా బాహు సాఠే విగ్రహాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇంచార్జి అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. మంత్రి వెంట ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, నగర మేయర్ ఉమారాణి, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు. మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇 Click here to 👆 Follow Our WhatsApp Channel

నిజామాబాద్‌లో ఇంటర్ ఫలితాలు 2025-26: 66.19% ఉత్తీర్ణత.. బాలికలదే పై చేయి

Image
2025-26 విద్యా సంవత్సరానికి గాను నిజామాబాద్ జిల్లాలో ఫిబ్రవరి మార్చి నెలలో నిర్వహించిన వార్షిక పరీక్షలలో జనరల్ విభాగంలో రెండవ సంవత్సరం విద్యార్థులు 66.19% ఉత్తీర్ణత సాధించారు. కాగా మొదటి సంవత్సరం విద్యార్థులు 56.64% ఉత్తీర్తో సాధించారు. అలాగే జిల్లాలో ఒకేషనల్ విభాగంలో రెండవ సంవత్సరంలో 67.68% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ మొదటి సంవత్సరం లో 49.65% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో ఫిబ్రవరి, మార్చ్ నెలలో నిర్వహించిన ఇంటర్ వార్షిక పరీక్షలలో మొత్తం రెండవ సంవత్సరం జనరల్ విద్యార్థులు మొత్తం 13,876 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 9,187 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలికలు 7,606 మంది పరీక్షలకు హాజరుకాగా 5,823 మంది బాలికలు ఉత్తీర్ణత కాగా 76.56% శాతం తో బాలుర పై చేయి సాధించారు. రెండవ సంవత్సరం బాలురు 6 ,273 మంది విద్యార్థులు హాజరు కాగా వీరిలో 3,364 మంది విద్యార్థులు పాసై 53.63% సాధించారు. మొదటి సంవత్సరం జనరల్ విభాగంలో మొత్తం విద్యార్థులు 15,547 మంది పరీక్షలకు హాజరు కాగా 8,806 మంది విద్యార్థులు పాస్ కాగా 56.64% సాధించారు. వీరిలో బాలికలు 8,711 మంది ...

హిందువుల ఐక్యత కోసమే ఆర్‌ఎస్‌ఎస్ స్థాపన : కందకుర్తిలో మోహన్ భగవత్

Image
దేశంలో ఉన్న హిందువులను ఐక్యం చేయడానికే హెడ్గేవార్ ఆర్ఎస్ఎస్ను ఏర్పాటు చేశారని ఆ సంస్థ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. రెంజల్ మండలంలోని మండలంలోని కందకుర్తి లోని కేశవ స్ఫూర్తి మందిరాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ శనివారం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మందిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హెడ్గేవార్ జననం, మరణం నాగ్పూర్లోనే జరిగిందన్నారు. అయితే ఆయన పూర్వికులు కందకుర్తికి చెందిన వారని చెప్పారు. దీంతో ఇక్కడ స్ఫూర్తి కేంద్రం నిర్మించాలని సంకల్పించామన్నారు. కందకుర్తి ప్రాశస్త్యం తనకు ఈ రోజు ఓ డాక్యుమెంటరీ వీడియో ద్వారా పూర్తిగా తెలిసిందన్నారు. హిందూ సమాజాన్ని జాగృతం చేయడానికి.. గరుడ్మంతుడు స్వర్గానికి వెళ్లి అమృతం తెచ్చి తన తల్లిని బానిసత్వం నుంచి విముక్తి చేశారని మోహన్ భగవత్ తెలిపారు. అనంతరం ఆ అమృతాన్ని తిరిగి తీసుకెళ్లి ఇంద్రుడికి ఇచ్చారని చెప్పారు. తన కోసం అమృతం తేలేదని, తల్లిని బానిసత్వం నుంచి విడిపించాడనికి తెచ్చాడని చెప్పారు. హెడ్గేవార్ సైతం తల్లి భారతమాతను దాస్య శృంఖాలల నుంచి విడిపించడానికి ఆర్ఎస్ఎస్ను ఏర్పాటు చేశారన్నారు. బ్రిటిష్ వాళ్లకంటే ముందు ఎంతో మందిని విదేశీయులు ...

పెర్కిట్ మహిళా ప్రాంగణం ఘటనపై కలెక్టర్ సీరియస్.. బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశం

Image
పెర్కిట్, మహిళా ప్రాంగణంలో ఇటీవల చోటుచేసుకున్న సంఘటనను కలెక్టర్ ఇలా త్రిపాఠి తీవ్రంగా పరిగణిస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. మహిళా ప్రాంగణం జిల్లా మేనేజర్ పి.ఇందిర శుక్రవారం సాయంత్రం కలెక్టర్ ను కలిసి జరిగిన సంఘటన గురించి తెలియజేశారు. గత మార్చి నెల 02 వ తేదీ నుండి 31వ తేదీ వరకు బ్యూటిషియన్ కోర్సులో బాలికలు, యువతులకు మహిళా ప్రాంగణంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఈ కోర్సులో శిక్షణ అందించిన తాత్కాలిక ఇన్ స్ట్రక్టర్ గా కొనసాగిన స్నేహ, బాలికలు, యువతుల ఫోటోలు, ఫోన్ నెంబర్లను సతీష్ అనే వ్యక్తికి పంపించిందని అన్నారు. దీంతో సతీష్ కొంతమంది యువతులకు ఫోన్ లు చేసి, వాట్సప్ చాటింగ్ ల ద్వారా వేధింపులకు గురి చేశాడని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. బాధిత యువతులు ఈ విషయాన్ని గురువారం రోజున తమ దృష్టికి తేగా, పోలీసులకు ఫిర్యాదు చేసి ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయించామని తెలిపారు. ఈ ఉదంతంపై కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. ఈ తరహా చర్యలను ఎంతమాత్రం ఉపేక్షించబోమని, బాధ్యులైన వారిపై జిల్లా యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. పెర్కిట్ మహి...

ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు

Image
మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలను శనివారం ఘనంగా జరుపుకున్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో దుబ్బ లోని మున్నూరు కాపు కల్యాణ మండపంలో పూలే జయంతి వేడుక నిర్వహించారు. అంతకుముందు వినాయకనగర్ లోని మహాత్మ జ్యోతిబా పూలే విగ్రహానికి అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, కలెక్టర్ ఇలా త్రిపాఠి, నగర మేయర్ కే.ఉమారాణి, ఇంచార్జి అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, బీసీ సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, అనేక ఆంక్షలతో కూడిన నాటి సమాజంలో నెలకొని ఉన్న రుగ్మతలను పారద్రోలేందుకు మహాత్మ జ్యోతిబాపూలే కొనసాగించిన కృషి అమోఘమని అన్నారు. అడుగడుగునా అవరోధాలు, అవమానాలు ఎదురైనప్పటికీ ఏమాత్రం చలించకుండా సాంఘిక దురాచారాలను దూరం చేసేందుకు పూలే ఎంతగానో శ్రమించారని గుర్తు చేశారు. అణగారిన వర్గాలు సమానత్వం సాధించాలంటే విద్య ఎంతో అవసరమని గుర్తించి వారికి విద్య అందేలా విశేషంగా కృషి చేశారని, మహిళల విద్య కోసం ప్రత్యేకంగా మొట్టమొదటి పాఠశాలను స్థాపింపజేశారని అన్నారు. ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ప్రభుత్వం బీ.సీ గురుకులాలకు జ...

కందకుర్తికి ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రాక.. కట్టుదిట్టమైన ఏర్పాట్లు

Image
నిజామాబాద్, ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఈ నెల 11న నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి పర్యటనకు హాజరు కానున్న నేపథ్యంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా అధికారులతో కలిసి ఆయన పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. కందకుర్తిలో కొనసాగుతున్న తుది ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్, అధికారులకు సూచనలు చేశారు. మోహన్ భగవత్ పర్యటనలో భద్రతా పరంగా ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. బహిరంగ సభకు వచ్చే వారు వాహనాలను పార్కింగ్ చేసుకునేందుకు ఎంపిక చేసిన స్థలంలో ఏర్పాట్లు, సభా ప్రాంగణం, బారికేడ్లు తదితర వాటిని కలెక్టర్ పరిశీలించారు. ఆర్ ఎస్ ఎస్ చీఫ్ భద్రతకు పకడ్బందీ బందోబస్తును ఏర్పాటు చేయాలని, ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా ముందస్తుగానే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని అన్నారు. సభా స్థలి వద్ద అన్ని వసతులతో కూడిన అంబులెన్స్, అగ్నిమాపక శకటం, వైద్య బృందం అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఏసీపీ శ్రీనివాస్, తహసీల్దార్ శ్రవణ్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. మ...